యాప్నగరం

భార్య నిప్పు పెట్టుకుని కాలిపోతుంటే.. భర్త ఫోన్ పట్టుకుని.. పైశాచికం

అత్తింటి వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. మంటల్లో కాలిపోతున్న భార్యను కాపాడాల్సింది పోయి ఫోన్ పట్టుకుని పైశాచికంగా ప్రవర్తించాడు.

Samayam Telugu 27 Nov 2020, 5:05 pm
కట్టుకున్న భార్య మంటల్లో తగలబడిపోతుంటే కాపాడాల్సింది పోయి కనీస కనికరం లేకుండా ప్రవర్తించాడో కసాయి భర్త. ఆమె ఆర్తనాదాలు విని కూడా జాలి కలగని దుర్మార్గుడు.. మంటల్లో కాలిపోతున్న వీడియోను ఆమె పుట్టింటి వారికి పంపించాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ అత్యంత అమానుష ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


ఝన్‌ఝను జిల్లాకి చెందిన వివాహిత అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. భార్య మంటల్లో తగలబడిపోతున్నా కనీస కనికరం లేని భర్త పైశాచికానికి దిగాడు. ఆమె అగ్నికీలల్లో కాలిపోతున్న దృశ్యాలను సెల్‌ఫోన్ వీడియో తీసి ఆమె పుట్టింటి వారికి పంపించాడు. మంటల్లో కాలిపోయిన బాధితురాలిని ఈ నెల 20న జైపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 22న ఆమె ప్రాణాలు విడిచింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని తేలడంతో గృహ హింస(498ఏ), ఆత్మహత్యకు కారణమైనందున (306) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మృతురాలి భర్త, అతని తల్లిదండ్రులు, సోదరుడు, పిన్ని, బాబాయ్‌లను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Also Read: పెళ్లికెళ్లిన అత్త.. తిరిగొచ్చేసరికి షాకిచ్చిన కోడలు.. కలికాలం!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.