యాప్నగరం

వైన్‌షాప్ వాచ్‌మెన్ దారుణహత్య... ‘పశ్చిమ’లో కలకలం

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ఓ గ్రామంలో వైన్‌ షాప్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వెంకటేశ్ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.

Samayam Telugu 28 Apr 2020, 8:57 am
లాక్‌డౌన్‌ కారణంగా తగ్గిన నేరాలు మళ్లీ మొదలయ్యాయి. కొద్దిరోజులుగా మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు తరుచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మల్లిపూడి వెంకటేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. వెంకటేష్ స్థానికంగా ఓ వైన్‌షాపు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.
Samayam Telugu Image


Also Read: ‘లుడో’ ఆటలో ఓడించిందని భార్య వెన్నుముక విరగ్గొట్టిన భర్త

వెంకటేశ్ కుటుంబసభ్యులు, స్థానికులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుడు వైన్‌షాపులో వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటంతో మద్యం సీసాల దొంగతనం కోసం వచ్చిన వారెవరైనా చంపేశారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తుస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Also Read: వాట్సాప్ స్టేటస్‌గా కరోనా సోకిన యువతి ఫోటో.. యువకుడి అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.