యాప్నగరం

పొలంలో పని చేసుకుంటున్న మహిళ కిడ్నాప్.. 13 రోజులు నిర్బంధించి నరకం..

కామాంధులు రెచ్చిపోయారు. పొలంలో పనిచేసుకుంటున్న మహిళను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఆమెను రోజుల తరబడి నిర్బంధించి పశువాంఛలు తీర్చుకున్నారు.

Samayam Telugu 23 Apr 2020, 9:54 pm
మహిళలపై నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా నడవడం అటుంచి పట్టపగలే తిరలేని పరిస్థితులు దాపురించాయి. పగటిపూట పొలంలో పని చేసుకుంటున్న మహిళను అపహరించి గ్యాంగ్‌ రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు సుమారు రెండువారాల పాటు నిర్బంధించి నరకం చూపారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొలంలో పనిచేసుకుంటున్న మహిళను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. పదమూడు రోజులు ఆమెను బంధించి నరకం చూపించారు. పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కామాంధుల చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Also Read: డెలివరీ బాయ్ ముస్లిం అని.. సరుకులు వద్దన్న కస్టమర్ జైలుకి..
ఏప్రిల్ 3వ తేదీన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్బంధించి అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ నెల 15 వరకూ నిందితులు తనను బంధించి గ్యాంగ్ రేప్ చేశారని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.