యాప్నగరం

తల్లీకూతుళ్లపై ముగ్గురి సామూహిక అత్యాచారం... హైదరాబాద్‌లో దారుణం

హైదరాబాద్‌‌లో దారుణం జరిగింది. చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళ, ఆమె కుమార్తెపై ఇంటి యజమాని, అతడి ఇద్దరు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు.

Samayam Telugu 22 Jul 2020, 1:11 pm
హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సందయ్య నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకుండే మహిళ, ఆమె కుమార్తెపై ఇంటి యజమాని, ఆయన ఇద్దరు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ వివాహిత(35) తన కూతురు(15), కుమారుడితో కలిసి ఓ ఇంట్లో నివాసముంటోంది. తనతో పాటు కూతురిపై ఇంటి యజమాని, అతడి ఫ్రెండ్స్‌ లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Samayam Telugu Image


Also Read: బెంగాలీ అమ్మాయిలతో వ్యభిచారం.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్

ఇంటి యజమాని తమకు ఇచ్చిన ఆహార పదార్ధాల్లో మత్తు మందు కలిపి ఇచ్చాడని, మత్తులోకి జారుకున్నాక తనతో పాటు కూతురిపైనా ముగ్గురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలితో పాటు కూతురిని ఉస్మానియా ఆస్పత్రికి, కొడుకును నీలోఫర్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: తెలంగాణ: స్నానం చేస్తుండగా వీడియో తీసి వివాహితపై లైంగిక దాడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.