యాప్నగరం

అనంతపురం: భర్తను చంపి ఆత్మహత్యగా నమ్మించిన భార్య.. పోలీసులకు ఎలా దొరికిందంటే!

అందరూ అతడిది ఆత్మహత్యగా భావించారు. కానీ ఆయనకు మాత్రం అనుమానం వచ్చింది. సీన్ కట్ చేస్తే కట్టుకున్న భార్యే చంపినట్లు తేలింది. పోలీసులకు ఎలా దొరికిపోయారంటే.

Samayam Telugu 25 Sep 2020, 8:12 am
కట్టుకున్న భర్తనే కిరాతకంగా చంపిందో భార్య. హత్యను ఆత్మహత్యగా నమ్మించింది.. కానీ కొద్దిరోజులకే పోలీసులకు ప్రియుడితో సహా అడ్డంగా దొరికిపోయింది. అనంతపురం జిల్లా దొడగట్టకు చెందిన శ్రీనివాసులు ఈ నెల 20న తన ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. అందరూ అతడిది ఆత్మహత్యగా భావించారు. కానీ శ్రీనివాసులు తండ్రికి మాత్రం అనుమానం వచ్చింది.. కోడలు తీరును గమనించాడు. వెంటనే ఏం జరిగిందని ఆరా తీయడంతో విషయం ఆయనకు తెలిసింది.
Samayam Telugu అనంతపురం


తన కుమారుడి మరణానికి కోడలు సరిత, ఆమె ప్రియుడు ప్రభాకరే కారణమని.. శ్రీనివాసులు తండ్రి రామచంద్రప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ విచారణలో సరిత, ప్రభాకర్ల మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తోందని తెలిసింది. ఈ క్రమంలోనే సరిత భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈనెల 20న రాత్రి సరిత భర్త శ్రీనివాసులుతో గొడవపడింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

భర్తపై కోపంతో సరిత ఇంట్లో ఉన్న పప్పు గుత్తితో శ్రీనివాసులు తలపై బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావమై శ్రీనివాసులు అక్కడికక్కడే చనిపోయాడు. సరిత ప్రియుడు ప్రభాకర్‌తో కలిసి ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు లుంగీతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. శ్రీనివాసులు తండ్రి ఫిర్యాదు తర్వాత వీరిద్దరూ పారిపోయారు.. వీరి కోసం రెండు బృందాలుగా ఏర్పడి గాలించగా గురువారం మాదిరెడ్డిపల్లి బస్టాండు దగ్గర ఇద్దరిని అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.