యాప్నగరం

భర్తకి కరోనా.. భార్య మరొకరితో రాసలీలలు.. కాకినాడలో దారుణం

కట్టుకున్నోడు కరోనా సోకి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటే భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో భార్య రాసలీలల వ్యవహారం బయటికి పొక్కడంతో..

Samayam Telugu 28 Aug 2020, 4:06 pm
భర్తకి కరోనా సోకిందన్న బాధ ఉందో.. లేదో కానీ మరొకరితో రాసలీలలకు రెడీ అయిపోయిందో భార్య. రోజూ ఇంటికి వచ్చి పండ్లు ఇచ్చి వెళ్తున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తీరా ఆ విషయం భర్తకి తెలిసిపోవడంతో ప్రియుడితో కలసి కట్టకున్నోడిపైనే దాడి చేసి తీవ్రంగా కొట్టింది. ఈ అమానుష ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


కాకినాడ పాతబస్టాండ్ సెంటర్ న్యూ వెంకటేశ్వర కాలనీకి చెందిన శ్రీనివాస్(పేరు మార్చాం)కి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన ఐసోలేషన్‌లో ఉండడంతో అన్నమ్మఘాటీ ఏరియా రెల్లి కాలనీకి చెందిన జె.రాజేష్ రోజూ పండ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడు. నిత్యం ఇంటికి వచ్చి వెళ్తుండడంతో శ్రీనివాస్ భార్య సునీత(పేరు మార్చాం)తో రాజేష్‌కి పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించేవారు.

Also Read: మా ఆయనే అలా చేయలేదన్న ప్రియురాలు.. కసితో ప్రియుడు.. నెల్లూరులో దారుణం

తీరా ఆ విషయం భర్తకి తెలిసిపోవడంతో కథ అడ్డం తిరిగింది. తన ఇంటికి వచ్చిన రాజేష్‌తో భర్త గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో అతని భార్య ప్రియుడికే వంతపాడింది. అంతటితో ఆగని ఆమె.. ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తపైనే చేయిచేసుకుంది. స్పందించిన స్థానికులు వెంటనే భర్తని జీజీహెచ్‌కి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Read Also: అన్నీ ఉన్నా ఉరేసుకున్న బ్యాంక్ మేనేజర్ భార్య.. అసలా డైరీలో ఏముంది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.