యాప్నగరం

యూట్యూబ్ విలేకరినంటూ రేషన్ డీలర్‌‌కు బెదిరింపులు.. మహిళపై కేసు

యూట్యూబ్ విలేకరినంటూ రేషన్ డీలర్‌ వద్దకు వచ్చిన మహిళ అక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకుంది. అనంతరం తనకు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది.

Samayam Telugu 1 Apr 2020, 8:58 am
విలేకరి పేరుతో రేషన్ డీలర్‌ను బెదిరించిన మహిళ కటకటాల పాలైన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. చింతలపూడి పట్టణంలోని పాత పురపాలక సంఘం కార్యాలయం వెనుక అడుసుమిల్లి అనూష రేషన్‌ దుకాణం నడుపుతున్నారు. సోమవారం ఎగ్గేపల్లి అనిత అనే అక్కడకు మహిళ వచ్చి తాను యూట్యూబ్‌ ఛానెల్‌ విలేకరినంటూ పరిచయం చేసుకుంది. రేషన్ దుకాణం వద్ద వీడియో, ఫొటోలు తీసింది. అన్ని వివరాలు కనుక్కున్న తర్వాత తనకు డబ్బులు ఇవ్వాలని అనూషను డిమాండ్ చేసింది. నీకు డబ్బులు ఎందుకివ్వాలంటూ ఆమె ప్రశ్నించగా ఆ మహిళ బ్లాక్‌మెయిల్‌కు దిగింది.
Samayam Telugu rape_4_13


Also Read: లాక్‌డౌన్‌లో బయటకు వచ్చాడని.. లాఠీలతో కొట్టి మూత్రం తాగించిన పోలీసులు

నీ రేషన్ దుకాణంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని మీడియాలో ప్రచారం చేస్తానని, దీంతో నువ్వు కేసులో ఇరుక్కుంటావని బెదిరించింది. తాను ఎలాంటి అవినీతికి పాల్పడటం లేదని, డబ్బులు ఇవ్వనని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ అనూష్ తీవ్రంగా స్పందించింది. అయినప్పటికీ ఆ మహిళ బెదిరింపులకు పాల్పడటంతో అనూష్ జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేస్తున్నారు. మీడియా పేరుతో అనేక మంది మోసాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read: భర్తే కాలయముడు... భార్యను మచ్చుకత్తితో నరికి చంపి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.