యాప్నగరం

భార్య గొంతుకోసి చంపేసిన భర్త.. హైదరాబాద్‌లో దారుణం

భార్యతో నాగరాజు నిత్యం గొడవపడేవాడు. తీవ్రంగా కొట్టేవాడని.. ఆమె పారిపోయి దాక్కునేదని స్థానికులు చెబుతున్నారు. హఠాత్తుగా ఆమె రక్తపు మడుగులో శవమై తేలింది.

Samayam Telugu 28 Jul 2020, 8:36 pm
హైదరాబాద్ నగర శివారు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యని భర్త అతి కిరాతకంగా గొంతుకోసి చంపేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. జల్‌పల్లి పరిధిలోని శ్రీరామ కాలనీకి చెందిన నాగరాజు(36) భార్య వరలక్ష్మి(35)తో తరచూ గొడవపడేవాడు. ఆమెని విపరీతంగా కొట్టేవాడు. భర్త చేతిలో దెబ్బలు తినలేక వరలక్ష్మి సమీపంలోని స్నేహితుల ఇళ్లలోకి వెళ్లి దాక్కునేదని స్థానికులు చెబుతున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


అర్ధరాత్రి వేళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్త నాగరాజు భార్య గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె శవాన్ని ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసి వెళ్లిపోయాడు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు నాగరాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: ముగ్గురం ఎంజాయ్ చేద్దాం.. శోభనం రాత్రి వధువుకి షాక్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.