యాప్నగరం

రాత్రి ఇంటికి రాని మరదలు.. వెతుక్కుంటూ వెళ్లిన వదిన.. దారుణం

వివాహిత మహిళ దుకాణానికని వెళ్లి రాత్రి ఇంటికి రాలేదు. కంగారు పడిన కుటుంబ సభ్యులు అనుమానితుడి ఇంటికి వెళ్లి చూడడంతో నోటికి గుడ్డకట్టేసి ఉంది. గుంటూరులో ఈ దారుణం జరిగింది.

Samayam Telugu 13 Oct 2020, 2:11 pm
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహిత మహిళను కామాంధుడు బలవంతంగా లాక్కెళ్లి ఇంట్లో బంధించి అత్యాచారం చేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. పెదకూరపాడు మండలం పొడపాడులో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వివాహిత మహిళ రాత్రి సమయంలో పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లింది. ఆమెపై కన్నేసిన జొన్నలగడ్డ శాంతిరాజు బలవంతంగా ఇంటికి లాక్కెళ్లాడు. ఇంట్లో బంధించి నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి తెగబడ్డాడు. ఆమెపై అత్యాచారం చేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rape


దుకాణానికి వెళ్లిన వివాహిత రాత్రి ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన ఆమె వదిన మరుసటి రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈలోగా శాంతిరాజుపై అనుమానంతో అతని ఇంటికి వెళ్లడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళ నోటికి గుడ్డకట్టి ఉంది. రాత్రి బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి బంధించి అత్యాచారం చేశాడని బాధితురాలు వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆమెను వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Also Read: నిద్రమాత్రలు మింగిన ప్రియురాలు.. ఇంటికి రాగానే ప్రియుడికి నిశ్చితార్థం.! విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.