యాప్నగరం

తిరుమలలో కిలాడీ లేడీ.. మూసేసిన దుకాణాల్లో దొంగతనాలు

తిరుమలలో మూసివేసి ఉన్న దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న కిలాడీని సీసీ కెమెరాలు పట్టించాయి. కొండపై పనిచేసే ఓ కార్మికురాలు కావడం గమనార్హం.

Samayam Telugu 20 May 2020, 6:54 pm
నిత్యం లక్షల మందితో కిటకిటలాడే తిరుమల లాక్‌డౌన్ కారణంగా బోసిపోయిన సంగతి తెలిసిందే. తిరుమల వీధులన్నీ నిర్మానుష్యంగా మారడంతో అడవి జంతువులు స్వేచ్ఛగా విహరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు తిరుమలలోని దుకాణాల్లో చోరీలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. తాజా ఘటనతో అది నిజమేనని తేలింది. ఓ లేడీ కిలాడీ తిరుమలలోని దుకాణాల్లో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు అడ్డంగా పట్టుబడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
lady burglar


తిరుమలలో మహిళా దొంగ రెచ్చిపోయింది. తిరువీధుల్లో మూసివేసి ఉన్న దుకాణాలే టార్గెట్‌గా హల్‌చల్ చేసింది. అందినకాడికి దోచుకుంటూ సీసీ కెమెరాలకు చిక్కింది. తిరుమల కొండపై పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ దుకాణాలలో చోరీలకు పాల్పడుతోంది. మూసి ఉన్న దుకాణాల్లోకి వెళ్లి సీసీ కెమెరాలను పగలగొట్టి వస్తువులు పట్టుకెళ్తున్న లేడీ కిలాడీ గుట్టురట్టైంది. ఆ బాగోతమంతా సీసీ కెమెరాల్లో రికార్డవడంతో ఆమె దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: చంద్రగిరిలో దారుణం.. కుక్కలు మొరిగాయని యజమాని పళ్లూడగొట్టి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.