యాప్నగరం

ఇంటర్వ్యూకి పిలిచి ఆఫీసులోనే యువతిపై గ్యాంగ్ రేప్

ఉద్యోగం కోసమని ఇంటర్వ్యూకి పిలిచి ఆఫీసులోనే యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బంగ్లాదేశ్ రాజధాిని ఢాకాలో వెలుగుచూసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చఏశారు.

Samayam Telugu 30 Sep 2019, 4:12 pm

ప్రధానాంశాలు:

  • బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన
  • ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై డైరెక్టర్ల గ్యాంగ్ రేప్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu RAPE4

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో దారుణ ఘటన జరిగింది. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లి యువతిపై కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢాకాలోకి ధన్‌మోండి ప్రాంతంలో జరిగింది.
Also Read: ఇంట్లోకి చొరబడి నర్సుపై అత్యాచారం

బంగ్లాదేశ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ అసోసియేషన్ కంపెనీలో ఉద్యోగం ఉందని తెలియడంతో ఓ యువతి శనివారం ఇంటర్వ్యూకి వెళ్లింది. ఆమెపై కన్నేసిన కంపెనీ డైరెక్టర్లు షకీల్, మొహిద్దీన్ రాత్రి వరకు ఆమెను ఉంచేశారు. చివరిగా ఆమెను క్యాబిన్‌కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం ఆమెపై ఇద్దరూ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Also Read: కోళ్లఫాంలో గ్యాంగ్‌రేప్.. 9మంది మధ్యవర్తుల అరెస్ట్

బాధితురాలి ఫిర్యాదుతో ఢాకా పోలీసులు షకీల్, మొహిద్దీన్‌‌లను ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ధన్‌మోండి పోలీసులు సోమవారం మీడియాకు వివరించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఢాకాలో ఇలాంటి ఘటనే గత నెలలో జరిగింది. ఆగస్ట 27న శ్యామోలీ ప్రాంతంలోని ఓ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లిన యూనివర్శిటీ విద్యార్థినిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బంగ్లాదేశ్‌లో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతుండటంతో అమ్మాయిలు ఇంటర్వ్యూలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

Also Read:Alwar అత్యాచారాల అడ్డా.. 24గంటల్లో మూడు గ్యాంగ్ రేప్‌లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.