యాప్నగరం

సగం కాలిపోయి నగ్నంగా మహిళ శవం.. నల్గొండలో కలకలం

ఒంటిపై బట్టల్లేకుండా సగం కాలిపోయిన మహిళ శవం లభ్యమైంది. సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉండొచ్చని.. హత్య చేసి ఇక్కడకు తెచ్చి తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

Samayam Telugu 1 Sep 2020, 9:42 pm
యాదాద్రి యువతి హత్యాచార ఘటన మరువక ముందే తెలంగాణ మరో దారుణం వెలుగుచూసింది. సగం కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం నల్గొండ జిల్లాలో కలకలం రేపుతోంది. నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం మంటల్లో కాలిపోయిన స్థితిలో లభ్యమైంది. ఆమెకు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Samayam Telugu కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం
murder


మృతురాలి ఎడమ చేతిపై బుజ్జి అనే పచ్చబొట్టు ఉంది. ఆమె కాళ్లకి వెండిపట్టీలు ఉన్నాయి. వాటిపై జేజే అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆనవాళ్లను బట్టి ఎవరైనా మహిళని గుర్తిస్తే తమను సంప్రదించాలని నార్కెట్‌పల్లి పోలీసులు కోరారు. నార్కెట్‌పల్లి సీఐ 94407 95610, ఎస్సై 94407 95635 సంప్రదించాలని తెలియజేశారు. దుండగులు మహిళను హత్య చేసి ఇక్కడకు తెచ్చి తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

Read Also: భర్తని చంపేసి భార్య హైడ్రామా.. సైలెంట్‌గా అంత్యక్రియలు.. తూర్పు గోదావరిలో దారుణం

Also Read: పంచాయతీ మహిళా ఉద్యోగి బట్టలూడదీసి.. ఇళ్ల కోసం లంచం తీసుకుందంటూ అమానుషం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.