యాప్నగరం

అడవిలో అమానుషం.. యువతిని చంపి పెట్రోల్ పోసి.. ఖమ్మంలో కలకలం

గుర్తుతెలియని అడవిలో చంపేసి తగలబెట్టేశారు. ఆమె ఒంటిపై బట్టలు అక్కడక్కడా కాలిపోగా.. ఆమె ముఖం మాత్రం పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 18 Jul 2020, 3:32 pm
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని యువతిని దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. సగం కాలిపోయిన స్థితిలో భయానకంగా ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లాలోని పాల్వంచ మండలం బండ్రుగొండ నుంచి పూసుగూడెం వైపు అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం కనిపించింది. ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా తెలుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
girl deadbody


మంటల్లో యువతి ముఖం, శరీరం కాలిపోయింది. ఆమె బట్టలు అక్కడక్కడా కాలిపోయాయి. మృతురాలి ఆచూకీ తెలియకూడదనే ముఖాన్ని కాల్చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. యువతిని హత్య చేసి ఇక్కడకు తెచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను అదే ప్రాంతానికి చెందిన గిరిజన యువతిగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Also Read: పగలు చిన్నింట్లో.. ‘నైట్ డ్యూటీ’ పెద్దింట్లో.. నిండుగర్భిణిని నట్టేట ముంచిన కేటుగాడుAlso Read: దోస్త్ వదినతో ఆ సంబంధం.! రంగారెడ్డిలో యువకుడి దారుణ హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.