యాప్నగరం

మొదటి భర్తకు విడాకులిచ్చేసి ఫేస్‌బుక్ ప్రియుడితో సహజీవనం.. చివరికి

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళ అతడు పెళ్లికి అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్‌లో జరిగింది.

Samayam Telugu 24 Sep 2019, 10:48 am
వాళ్లిద్దరు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. తరుచూ చాట్ చేసుకునే క్రమంలో ఆ పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. తీరా మోజు తీరాక ప్రియుడు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేశాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఫేస్‌బుక్ ప్రేమ విషాదంగా ముగిసింది.
Samayam Telugu pjimage


Also Read: చిత్తూరు జిల్లాలో 14ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. చావు బతుకుల్లో బాధితురాలు

తెలంగాణలోని భద్రాచలంకు చెందిన చేబ్రోలు విమల(24) అనే యువతికి 2017లో ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే భర్తతో కలిసి ఉండలేక మూడు నెలలకే పుట్టింటికి వచ్చేసి విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు కరీంనగర్ జిల్లా పోరండ్లకు చెందిన పవన్‌కుమార్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. రోజూ చాట్ చేసుకోవడంతో ఇద్దరి మధ్య చనువు పెరిగి ప్రేమకు దారితీసింది. దీంతో వారిద్దరు కలిసి బతకాలనుకున్నారు. రెండేళ్ల నుంచి కరీంనగర్‌లో ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు.

Also Read: ఆటాడుకుందాం రా అంటూ ఏడేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. 8నెలలుగా కీచకపర్వం

తనను పెళ్లి చేసుకోవాలని విమల తరుచూ పవన్‌కుమార్‌పై ఒత్తిడి తెస్తుండగా అతడు ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఈ విషయంపై ప్రియుడిని గట్టిగా నిలదీయగా.. ఇంతకుముందే పెళ్లయిన నిన్ను నేను పెళ్లిచేసుకోను. ఇద్దరికి ఇష్టం ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం.. అంటూ పవన్ పెళ్లి ప్రతిపాదన తిరస్కరించాడు. దీంతో మనస్తాపం చెందిన విమల ఆదివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఆత్మహత్యకు పవన్‌కుమారే కారణమని విమల తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: భార్య ఇంట్లో లేని సమయం చూసి మరదలిపై అఘాయిత్యం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.