యాప్నగరం

పెళ్లైన మూణ్నెళ్లకే నవవధువు ఆత్మహత్య.. చిత్తూరులో విషాదం

సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంట్లోని మొదటి అంతస్తులో పద్మజ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకి పెళ్లై కేవలం మూడు నెలలే కావడం గమనార్హం.

Samayam Telugu 31 Mar 2020, 4:20 pm
పెళ్లైన మూణ్నెళ్లకే నవవధువుకి నూరేళ్లు నిండిపోయాయి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన చిత్తూరు జిల్లా పీలేరులో జరిగింది. కడప జిల్లా సుండుపల్లెకి చెందిన వెంకటరమణ కుమార్తె పద్మజ(21)కు పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ బండమీదపల్లెకి చెందిన రైల్వే గేట్‌మెన్ శివకృష్ణతో వివాహం జరిపించారు. పెళ్లైన మూణ్నెళ్లకే ఆమె అర్ధాంతరంగా తనువు చాలించింది.
Samayam Telugu death1


ఇంట్లోని మొదటి అంతస్తులో పద్మజ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయడాన్ని గుర్తించిన భర్త శివకృష్ణ ఆమెను హుటాహుటిన పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో బండమీదపల్లెలో విషాదం నెలకొంది.

Also Read: మరో ప్రణయ్ బలి.. కూతురి భర్తని కత్తులతో పొడిచి.. దారుణం

వివాహం జరిగి మూణ్నెళ్లు నిండా గడవకుండానే నవవధువు ఆత్మహత్యకు పాల్పడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు కారణాలేంటి? అంత పెద్ద ఇబ్బందులేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: వేధింపులు భరించలేక వివాహిత అఘాయిత్యం.. భువనగిరిలో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.