యాప్నగరం

నరసరావుపేట: వివాహిత అనుమానాస్పద మృతి... అల్లుడిపై అత్తమామల ఫిర్యాదు

భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తున్న మహిళ కొద్దిరోజులుగా అతడితో గొడవపడుతోంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 31 Jul 2020, 3:05 pm
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వివాహిత ఆత్మహత్య అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డు స్టేడియం సమీపంలో ఖాజావలి, షేక్‌ జానీ బేగం(26) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఖాజావలి స్థానికంగా ఓ రైస్ మిల్లులో మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఖాజావలి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో జానీ బేగం కొంతకాలంగా భర్తతో గొడవ పడుతోంది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.
Samayam Telugu భర్త, కొడుకుతో జానీ బేగం(File Photo)


Also Read: 47 చోరీల్లో నిందితుడు... మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో చిక్కాడు

ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుంది. గమనించిన స్థానికులు రక్షించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసేసరికే జానీ బేగం మరణించింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తుందన్న కక్షతో అల్లుడే తమ కూతురిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతిరాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Also Read: అమరావతి: కరోనా టెస్ట్ పేరుతో యువతిపై లైంగిక దాడి.. ల్యాబ్ టెక్నీషియన్ పైశాచికం

దీనిపై మృతురాలి తండ్రి బాజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే టూటౌన్ పీఎస్‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్ వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఖాజావలి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు వర్గాల ఫిర్యాదులపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read: రెండు వారాలకే కొత్త కోడలికి వేధింపులు... పుట్టింట్లో ఉరేసుకున్న యువతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.