యాప్నగరం

వరకట్న వేధింపులకు మహిళ బలి.. శానిటైజర్ తాగి ఆత్మహత్య

గతేడాది ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ కూకట్‌పల్లిలో కాపురం పెట్టారు. కట్నం కోసం భర్త తరుచూ వేధిస్తుండటంతో దీప్తి తట్టుకోలేక శుక్రవారం శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డింది.

Samayam Telugu 13 Apr 2020, 12:08 pm
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కట్నం కోసం వేధిస్తుండటంతో తట్టుకోలేకపోయిన మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మేకల దీప్తి(18), దోనే అమర్‌ కొన్నా్ళ్లుగా ప్రేమించుకుంటూ 2019లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చేసి కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు. అమర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. దీప్తి ఇంట్లోనే ఉంటోంది.
Samayam Telugu suicides


Also Read: చెట్టుకు వేలాడుతూ ఇద్దరు యువతులు.. పక్కనే చిన్నారి మృతదేహం .. మేడ్చల్‌లో విషాదం

కొద్ది నెలల పాటు సాఫీగానే సాగిన వీరి కాపురంలో వరకట్న వేధింపులు చిచ్చు రేపాయి. పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలంటూ అమర్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారు. కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. శుక్రవారం కూడా భర్త గొడవపడి కొట్టడంతో దీప్తి మనోవేదనకు గురైంది. మధ్యాహ్న సమయంలో అపార్ట్‌మెంట్‌ వాసులు వాడేందుకు ఏర్పాటుచేసిన శానిటైజర్ తాగేసింది. ఇది గమనించిన భర్త ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన వివాహిత... కృష్ణా జిల్లాలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.