యాప్నగరం

మొదటి భర్తను మరిచిపోలేక.. రెండో భర్తతో ఉండలేక మహిళ ఆత్మహత్య

విడాకులు తీసుకున్నా మొదటి భర్త జ్ఞాపకాలను మరిచిపోలేని మహిళ రెండో భర్తతో కాపురం చేయలేక సతమతమైంది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 7 May 2020, 2:04 pm
మొదటి భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్న మహిళ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది. హీనా కౌసర్(27) అనే మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే దంపతుల మధ్య తరుచూ గొడవలు జరగడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో హీనా పిల్లలతో కలిసి మైసూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణం గౌసియా నగరలో నివాసముంటోంది.
Samayam Telugu Image


Also Read: బట్టలు ఉతకలేదని ఘాతుకం.. నిండు గర్భిణిని కత్తితో పొడిచి చంపిన బావ

అయితే ఒంటరితనం భరించలేకపోయిన హీనా పెద్దల సలహాతో మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. రెండో భర్తతో కాపురం చేస్తున్నప్పటికీ మొదటి భర్త జ్ఞాపకాలను మాత్రం మరిచిపోలేకపోయింది. రోజులు గడిచేకొద్దీ మొదటి భర్తతో విడిపోయి తప్పు చేశానేమోనన్న ఆందోళన మొదలైంది. దీంతో రెండో భర్తతో సరిగ్గా కాపురం కూడా చేయలేకపోతోంది. రోజూ మొదటి భర్తనే గుర్తుచేసుకుంటూ తీవ్ర మానసిక క్షోభకు గురైంది. దీంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: పొరుగింటి వ్యక్తితో ఆంటీ అఫైర్.. నిద్రపోతున్న భర్తను కిరాతకంగా చంపి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.