యాప్నగరం

వరకట్న వేధింపులు... పెళ్లయిన ఏడాదికే మహిళ ఆత్మహత్య

పెళ్లయిన ఆరు నెలలకే అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధించడంతో రేష్మ తట్టుకోలేకపోయింది. శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 12 Apr 2020, 12:06 pm
వరకట్న వేధింపులకు తాళలేక పెళ్లయిన ఏడాదికే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాబాసాగర్‌ గ్రామానికి చెందిన రేష్మ(25)కు అదే గ్రామానికి చెందిన ఆయిదే రూపేష్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. రేష్మ తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి సురేఖ అన్ని బాధ్యతలు చూసుకొంది. పెళ్లయిన ఆరు నెలల వరకు వీరి కాపురం సాఫీగానే సాగింది.
Samayam Telugu dead body


Also Read: పరాయి వ్యక్తితో భార్య అఫైర్.. నోట్లో యాసిడ్ పోసి చంపేసిన భర్త

ఆ తర్వాతి నుంచి ఆమెకు అదనపు కట్న వేధింపులు మొదలయ్యాయి. భర్త రూపేష్‌తో పాటు అత్తమామలు లక్ష్మి, చంద్రయ్య రూ.లక్ష అదనపు కట్నం తేవాలని ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. ఈ విషయంపై రేష్మ పలుమార్లు తల్లితో చెప్పి ఆవేదన చెందింది. కొద్దిరోజుల తర్వాత అంతా సర్దుకుంటుందని ఆమె కూతురికి చెప్పి సముదాయించింది. శుక్రవారం కట్నం డబ్బుల కోసం అత్తింటి వారు రేష్మతో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన రేష్మ పురుగుల మందు తాగేసింది. అనంతరం పుట్టింటికి వెళ్లి తల్లితో విషయం చెప్పడంతో తల్లి వెంటనే సిర్పూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కాగజ్‌నగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. రేష్మ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపుల కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: గాఢనిద్రలో భర్త.. ప్రియుడితో గదిలో వివాహిత రాసలీలలు.. నగ్నంగా చూశాడని

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.