యాప్నగరం

వేధింపులు భరించలేక వివాహిత అఘాయిత్యం.. భువనగిరిలో విషాదం

పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 30 Mar 2020, 6:23 pm
వరకట్న వేధింపులు మరో మహిళను బలితీసుకున్నాయి. అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. మూడు రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే పురుగుల మందు తాగి మూడు రోజులైనా నిన్నటి వరకూ ఆమె తల్లిదండ్రులకు తెలియజేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Samayam Telugu pjimage (5)


భువనగిరి మండలం హనుమాపురం గ్రామానికి చెందిన రంగం మల్లేష్ గౌడ్‌కి స్వప్నతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. పెళ్లి జరిగిన కొద్దిరోజులకే స్వప్నకి వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త మల్లేష్ గౌడ్ భార్యని వేధింపులకు గురిచేసేవాడు. కొద్దికాలం మౌనంగా భరించిన స్వప్న.. వేధింపులు పెరిగిపోవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకుంది.

Also Read: ఎనిమిది నెలల గర్భిణి 100 కి.మీ కాలినడక.. ఆహారం దొరక్క.. చివరికి..

మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వప్న ఈరోజు (మార్చి 30న) మరణించింది. కూతురి మరణవార్త తెలిసి ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని భోరున విలపించారు. భర్త కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు.

Read Also: భార్యతో బలవంతంగా మద్యం తాగించి దారుణం.. శవాన్ని వేలాడదీసి హైడ్రామా.. పోలీసులకే షాక్

తమ కూతురు పురుగుల మందు తాగి మూడు రోజులైతే నిన్నటి వరకూ కనీసం సమాచారం ఇవ్వలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. పెళ్లైన దగ్గర్నుంచి తమ కూతురిని అల్లుడు అదనపు కట్నం కోసం హింసిస్తూనే ఉన్నాడని, కూతురిని చూసేందుకు వెళ్తే తమపై దాడి చేసి.. వాహనాన్ని కూడా ధ్వంసం చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ఇరుకుటుంబాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: కొత్తగూడెం: టీఆర్‌ఎస్ ఎంపీటీసీపై హత్యాయత్నం.. ఆయుధాలతో వెంబడించి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.