యాప్నగరం

కూతురితో కలసి తల్లి ఆత్మహత్య.. భూపాలపల్లిలో విషాదం

తల్లీకూతుళ్ల ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. అభం శుభం తెలియని కూతురితో సహా తల్లి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

Samayam Telugu 6 Nov 2020, 5:42 pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని రెండేళ్ల చిన్నారితో కలసి తల్లి అఘాయిత్యం చేసుకుంది. భూపాలపల్లిలోని జవహర్‌నగర్‌ కాలనీలో నివాసముంటున్న సంగరి లాస్య(25) తన రెండున్నరేళ్ల కూతురు మహితితో కలసి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లీబిడ్డల మృతితో కాలనీలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


Also Read: మహిళతో బలవంతంగా మద్యం తాగించి.. హైదరాబాద్ హత్యాచార ఘటనలో సంచలన విషయాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.