యాప్నగరం

అభాగ్యురాలి శవాన్ని పీక్కుతిన్నాయ్.. తీవ్రంగా కలిచివేసే ఘటన

తెలంగాణలో విషాద ఘటన వెలుగుచూసింది. భిక్షాటన చేసి బస్టాండ్‌లో నిద్రపోయే అభాగ్యురాలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని వరాహాలు పీక్కుతిన్నాయి.

Samayam Telugu 13 Dec 2020, 11:46 am
దిక్కూమొక్కూలేని అభాగ్యురాలు భిక్షాటన చేస్తూ కాలం వెళ్లబుచ్చుతోంది. ఆరోగ్యం సహకరించక రోజూ పడుకునే బస్టాండ్ ఆవరణలోనే ప్రాణాలు కోల్పోయింది. చనిపోయాక కూడా ఆమెకు రక్షణ లేకుండా పోయింది. అనాథ శవంగా పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పందులు పీక్కుతినడం తీవ్రంగా కలచివేస్తోంది. ఈ అమానుష ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


జిల్లాలోని అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఆవరణలో విషాద ఘటన వెలుగుచూసింది. పట్టణంలో భిక్షాటన చేసి రాత్రి పూట బస్టాండ్ ఆవరణలో తలదాచుకుంటున్న అభాగ్యురాలు నిద్రలోనే చనిపోయింది. చలనం లేకుండా పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పందులు పీక్కుతిన్నాయి. మహిళ మృతదేహాన్ని వరాహాలు పీక్కుతినడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులకు సమాచారం అందించడంతో మున్సిపల్ సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.

Also Read: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. నదిలో పడి గల్లంతైన బాలిక

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.