యాప్నగరం

షాకింగ్: కోడలి కోసం అత్త పూజలు.. నాలుక కోసుకుని..

బిడ్డతో సహా కోడలు కనిపించకుండా పోయింది. దిగాలు చెందిన అత్త అందరు దేవుళ్లకు మొక్కింది. ఎవరో చెప్పారని మూఢభక్తితో నాలుక కోసేసుకుని..

Samayam Telugu 18 Aug 2020, 9:46 pm
అత్త ముందు నోరుతెరిచి మాట్లాడితే నాలుక కోసేసిన ఘటనలు ఎప్పుడైనా వినుంటారు.. కానీ కోడలి కోసం అత్త నాలుక కోసుకున్న షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మీరు విన్నది నిజంగా నిజమే!! కోడలు క్షేమంగా తిరిగిరావాలని అత్త ఆలయంలో పూజలు చేయడమే కాదు.. తన నాలుకను కోసేసి దేవుడికి సమర్పించింది. జార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన కంప్యూటర్ యుగంలోనూ మూఢనమ్మకాలకు అద్దం పడుతోంది. సెరైకెలా ఖర్సావన్ జిల్లాలోని ఎన్‌ఐటీ క్యాంపస్ ఏరియాకి చెందిన లక్ష్మీ కోడలు జ్యోతి కొద్దిరోజుల కిందట కనిపించకుండా పోయింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
tongue cut


బిడ్డతో సహా తప్పిపోయిన కోడలు క్షేమంగా ఇంటికి రావాలని అత్త లక్ష్మి దేవుళ్లకు మొక్కింది. ఆలయాలకు వెళ్లి పూజలు చేసింది. ముక్కంటికి నాలుక సమర్పిస్తే కనిపించకుండా పోయిన కోడలు తిరిగి వస్తుందని ఎవరో చెప్పడంతో చివరికి నాలుకను కోసేసుకుంది. నాలుక కోసేసుకున్న అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్నా ఆమె ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించడం గమనార్హం. ఆమెకు నచ్చజెప్పి ఒప్పించి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమె ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నారని.. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. కనిపించకుండా పోయిన ఆమె కోడలి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: రేప్ చేసి వదిలేసిన కామాంధుడు.. ఒంటరిగా మరో కీచకుడి చేతికి.. గుంటూరులో ఘోరంRead Also: భార్య నల్లగా ఉందని.. భర్త ఘాతుకం.. హైదరాబాద్‌లో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.