యాప్నగరం

కాలువలో నగ్నంగా యువతి శవం.. గుంటూరులో సంచలనం

గుంటూరు జిల్లాలో పాతికేళ్ల యువతి శవం కాలువలో నగ్నంగా కనిపించింది. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది.

Samayam Telugu 3 Mar 2020, 10:57 pm
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంలోని ఈద్గ వెనుక పాతికేళ్ల వయసున్న యువతి మృతదేహం లభ్యమైంది. ఈద్గ వెనుక ఉన్న కాలువలో నగ్నంగా యువతి మృతదేహం ఉంది. ఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే ఆకుపచ్చ రంగు చుడీదార్ కనిపించింది. నగ్నంగా యువతి మృతదేహం కాలువలో తేలడం.. ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే అక్కడి చేరుకున్నారు.
Samayam Telugu guntur woman


ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేటకు చెందిన భాను కుమారిగా భావిస్తున్నారు. యువతి వయసు పాతికేళ్లు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘటనా స్థలాంలో లభించిన ఆధారాలను బట్టి యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు. కాలువలో నగ్నంగా యువతి మృతదేహం ఉండటం, ఘటనా స్థలానికి కొద్ది దూరంలో చుడీదార్ లభించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.