యాప్నగరం

తల, మొండెం వేరై మహిళ ఛిద్రం.. గుంటూరులో విషాదం

పని చేస్తే కానీ పూట గడవని పేదకూలీ ప్రమాదవశాత్తూ చనిపోయింది. యంత్రం అమాంతం ఆమెను మింగేయడంతో శరీరం ఛిద్రమై ప్రాణాలు విడిచింది.

Samayam Telugu 19 Apr 2020, 6:32 pm
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. చిన్న వయస్సులోనే ప్రమాదవశాత్తూ భర్త చనిపోవడంతో కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించకుంటున్న ఆమెను చూసి విధి కన్నుకుట్టింది. ప్రమాదం రూపంలో ప్రాణాలు తీసింది. అప్పటి వరకూ పని చేసిన యంత్రమే ఆమెను అమాంతం మింగేసింది. తల శరీరం వేరుపడి ఛిద్రమై అక్కడికక్కడే మరణించింది. ఈ అత్యంత విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu murder.


జిల్లాలోని అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో మొక్కజొన్న యంత్రంలో పడి వ్యవసాయ కూలీ మృతి చెందింది. పెదపూడి గ్రామానికి చెందిన పెదపూడి మరియమ్మ (35) ఆదివారం మొక్కజొన్న నూర్పిడి పనులకు వెళ్లింది. యంత్రంలో మొక్కజొన్న వేస్తుండగా ప్రమాదవశాత్తూ చీర అందులో పడి యంత్రం చుట్టేయడంతో ఆమె శరీరం ఛిద్రమైంది.

Also Read: భార్యని చంపి చెరువులో పడేసి.. 3 రోజుల తర్వాత శవాన్ని బయటికి తీసి.. చిత్తూరు కేసులో భయంకర నిజాలు

తల మొండెం నుంచి వేరు పడడడంతో అక్కడికక్కడే మరణించింది. భయానక ఘటనతో కూలీలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తల తెగిపడడడం చూసి భయాందోళనకు గురయ్యారు. ఏడాది కిందట ఆమె భర్త విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు తెలుస్తోంది. గతేడాది ప్రమాదవశాత్తూ మరణించగా.. ఇప్పుడు భార్య కూడా ప్రమాదంలో మృతి చెందడం పెదపూడి గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది.

Read Also: స్నానం చేయడు కానీ సెక్స్ కావాలట.! భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.