సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలోనే ఓ మహిళ సజీవదహనమైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. సోషల్ మీడియా పోస్ట్ విషయమై ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. చినికి చినికి గాలివానలా మారినట్టు చివరికి ఆమె ప్రాణాలు తీసేదాకా వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లమ్లోని అంచల్కు చెందిన బాధితురాలు అథిర (28), షాన్వాజ్ (30) కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరికి మూడు నెలల చిన్నారి కూడా ఉంది. అథిర సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై షాన్వాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. కోపంతో ఊగిపోయిన షాన్వాజ్.. ఇంటిలో ఉన్న కిరోసిన్ను అథిర ఒంటిపై పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అథిర తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ ఘటనలో షాన్వాజ్కు గాయాలు కావడంతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అంచల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అంచల్ పోలీస్ స్టేషన్ అధికారి సాయిజూ నాథ్ మాట్లాడుతూ.. ‘‘అథిర సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో గురించి షాన్వాజ్ వాగ్వాదానికి దిగాడని ఆమె తల్లి ఫిర్యాదు చేసింది.. ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. వీరికి మూడు నెలల చిన్నారి ఉన్నాడు’’ అని తెలిపారు. ఒంటికి నిప్పంటించిన తర్వాత అథిర పెద్దగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు చేరుకుని మంటలు ఆర్పారు. అనంతరం ఇద్దర్నీ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు.
అథిర చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా షాన్వాజ్పై హత్య కేసు నమోదుచేశామని పోలీసులు తెలిపారు.
అంచల్ పోలీస్ స్టేషన్ అధికారి సాయిజూ నాథ్ మాట్లాడుతూ.. ‘‘అథిర సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో గురించి షాన్వాజ్ వాగ్వాదానికి దిగాడని ఆమె తల్లి ఫిర్యాదు చేసింది.. ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. వీరికి మూడు నెలల చిన్నారి ఉన్నాడు’’ అని తెలిపారు. ఒంటికి నిప్పంటించిన తర్వాత అథిర పెద్దగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు చేరుకుని మంటలు ఆర్పారు. అనంతరం ఇద్దర్నీ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు.
అథిర చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా షాన్వాజ్పై హత్య కేసు నమోదుచేశామని పోలీసులు తెలిపారు.