యాప్నగరం

Hyd: ఇంటి ఓనర్ భార్యతో మాటలు కలిపిన భర్త.. భార్య కంటపడడంతో.!

భర్తపై అనుమానం పెంచుకున్న ప్రియ తరచూ అతనితో గొడవపడేది. మహిళలతో మాట్లాడితే అస్సలు ఊరుకునేది కాదు. ఓ రోజు ఇంటి ఓనర్ భార్యతో భర్త మాట్లాడుతూ కనిపించడంతో..

Samayam Telugu 16 Aug 2020, 3:51 pm
అనుమానపు భార్య వేధింపులు భరించలేక భర్త దారుణంగా హత్య చేసిన షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. అఫ్జల్‌గంజ్ ఏరియా షాహినాత్‌గంజ్ ప్రాంతంలో నివాసముంటున్న రాజు(37), ప్రియ(24)కి ఏడేళ్ల కిందట వివాహమైంది. వారికి నాలుగేళ్ల కూతురు సంతానం. రాజు అబిడ్స్‌లోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. భర్తపై అనుమానం పెంచుకున్న ప్రియ ఆడవారితో మాట్లాడితే గొడవపడేది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suspect


అదే విషయమై ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. రెండు రోజుల కిందట తాము అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని భార్యతో రాజు మాట్లాడుతుండగా ప్రియ కంటపడింది. అసలే అనుమానం కావడంతో భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో అతని సోదరుడు ప్రియ బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అప్పటికి గొడవ సద్దుమణిగింది. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో నిద్రలేచిన ప్రియ.. మరోసారి భర్తతో గొడవకు దిగింది.

Also Read: ముగ్గురు కూతుళ్లలో ఒక్కరూ మిగల్లేదు.. చిత్తూరులో కంటతడి పెట్టించే విషాద ఘటన

దీంతో భార్య అనుమానం భరించలేకపోయిన రాజు దారుణానికి పాల్పడ్డాడు. గట్టిగా ఆమె గొంతునులిమడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం చీరతో ఉరి బిగించి కిరాతకంగా చంపేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. అనుమానపు భార్య వేధింపులు భరించలేక చంపేశానని చెప్పి సరెండర్ అయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: ‘పీరియడ్స్‌లో కండోమ్‌తో చేయమన్నాడు..’ గంటకి 250 డాలర్లు.. బాలికకి నరకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.