యాప్నగరం

ముళ్లపొదల్లో అస్తి పంజరంగా మారిన బాలింత.. మంచిర్యాలలో విషాద ఘటన

బిడ్డను ప్రసవించిన నాలుగు రోజులకే బాలింత కనిపించకుండా పోయింది. సుమారు 20 రోజుల తర్వాత ముళ్లపొదల్లో అస్తిపంజరంగా మారింది.

Samayam Telugu 6 Oct 2020, 2:54 pm
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ అనుమానాస్పద స్థితిలో అస్తిపంజరంగా కనిపించింది. ఆస్పత్రిలో ఉండాల్సిన బాలింత ఊరి చివరన ముళ్లపొదల్లో చెట్టుకు వేలాడుతూ దర్శనమిచ్చింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేసి ఉరికి వేలాడదీశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగుచూసింది. కుమురం భీం జిల్లా లగ్గాం గ్రామానికి చెందిన మానస(36)కి చెన్నూర్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన రమేశ్‌తో 15 ఏళ్ల కిందట వివాహమైంది.
Samayam Telugu అనుమానాస్పదంగా మరణించిన మానస
death


గత నెల 13న చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మానస మగబిడ్డను ప్రసవించింది. అనంతరం నాలుగు రోజులకే ఆమె ఆస్పత్రి నుంచి అదృశ్యమైంది. భార్య ఏమైపోయిందో తెలియని భర్త 17న పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన మానస కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పట్టణ శివారులోని ముళ్లపొదల్లో కుళ్లిపోయి అస్తిపంజరంగా మారిన మహిళ మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: అత్తని కొట్టాడని.. భర్తని కట్టేసి గొంతుకోసిన భార్య.. జగిత్యాలలో దారుణం

స్పాట్‌కి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించారు. ఆమె చున్నీ, చెవి దుద్దుల ఆధారంగా ఆమెను కనిపించకుండా పోయిన మానసగా గుర్తించారు. బిడ్డ పుట్టిన నాలుగు రోజులకే కనిపించకుండా పోయిన బాలింత శవమై కనిపించడం కలకలం రేపింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: కామాంధుడిని కొడవలితో నరికి తప్పించుకున్న బాలిక.. చిత్తూరులో షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.