యాప్నగరం

Hyderabad: నగరం నడిబొడ్డున మహిళ శవం.. టాటూనే ఆధారం.. ఎవరామె?

చెరువులో తేలుతున్న మహిళ శవాన్ని పోలీసులు బయటకు తీయించారు. హతురాలి కుడిచేతిపై ఉన్న ‘ఎస్’ టాటూ మినహా ఎలాంటి ఆధారం లభ్యం కాకపోవడంతో మిస్టరీగా మారింది.

Samayam Telugu 21 Jun 2020, 4:09 pm
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మహిళను కిరాతకంగా చంపేసి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి చెరువులో పడేసిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరబండ సమీపంలోని సున్నం చెరువులో ప్లాస్టిక్ కవర్లలో చుట్టిన మృతదేహం తేలిందని సమాచారం రావడంతో సనత్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శవాన్ని చెరువులో నుంచి బయటకి తీయించారు.
Samayam Telugu మహిళ డెడ్‌బాడీపై ఉన్న టాటూ
hyderabad murder


సన్నని తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న మహిళ మృతదేహం బాగా ఉబ్బిపోయి ఉండడంతో ఆనవాళ్లు తెలియడం లేదు. మృతదేహాన్ని చెరువులో పడేసి చాలా రోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళ మృతదేహం తలపై బలమైన గాయాలున్నట్లు గుర్తించారు. మహిళను ఎవరో హత్య చేసి చెరువులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Also Read:
ఐఆర్‌ఎస్ అధికారి శృంగార లీలలు.! ఒంటరినని చెప్పి మహిళతో ఎఫైర్.. రెండేళ్లు..

మహిళ వయస్సు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ఆమె కుడిచేతిపై ‘ఎస్’ అనే అక్షరం టాటూ వేయించుకుని ఉంది. మృతదేహం పూర్తిగా పాడవడంతో మహిళను గుర్తించేందుకు టాటూ ఒక్కటే ఆధారమైంది. ఎస్ అనే టాటూ వేయించుకున్న మహిళ ఎవరికైనా తెలిస్తే తమను సంప్రదించాలని సనత్ నగర్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also: బాలికపై టెన్త్ విద్యార్థుల పైశాచికం.. సెక్స్ వీడియోలు చూపించి.. పదేపదే అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.