హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైల్లో వెళ్తున్న యువతి మార్గమధ్యలో శవమై కనిపించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని లింగనేనిదొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వానపల్లి చిన్ని(27) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసని హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది. ఓ పని నిమిత్తం బెంగళూరు వెళ్లేందుకు బుధవారం కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే రైలెక్కింది. గురువారం ఉదయం లింగనేనిదొడ్డ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన యువతి మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చిన్ని ప్రమాదవశాత్తూ రైల్లో నుంచి పడిపోయిందా? లేక ఆత్మహత్య చేసుకుందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న తమ కూతురు బెంగళూరులో మరో ఉద్యోగం కోసం వెళ్తున్నట్లు తమకు చెప్పిందని.. ఇంతలోనే మరణవార్త వినాల్సి వస్తుందనుకోలేదని చిన్ని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్ రైల్వే ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న తమ కూతురు బెంగళూరులో మరో ఉద్యోగం కోసం వెళ్తున్నట్లు తమకు చెప్పిందని.. ఇంతలోనే మరణవార్త వినాల్సి వస్తుందనుకోలేదని చిన్ని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్ రైల్వే ఆస్పత్రికి తరలించారు.