యాప్నగరం

ఒంగోలులో మహిళపై గ్యాంగ్ రేప్?.. రోడ్డుపక్కన నగ్నంగా బాధితురాలు

ఒంగోలు శివారులోని కేశవరాజు కుంటలో ఓ మహిళ మంగళవారం రాత్రి నగ్నంగా పడివుంది. సంఘటనా స్థలంలో పరిస్థితి చూస్తే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Samayam Telugu 22 Jan 2020, 1:29 pm
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. నగర శివారులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కేశవరాజు కుంట శివారులో మంగళవారం రాత్రి ఓ మహిళ వివస్త్రగా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu rape3


Also Read: పచ్చని సంసారాన్ని చిదిమేసిన విధి.. భర్త, కుమార్తె మృతితో అనాథగా మారిన మహిళ

ఘటనాస్థలంలో బాధితురాలు పక్కన మహిళల లోదుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడి ఉండటంతో పోలీసులు అనేకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమె శరీరంపై గాయాలు కూడా ఉండటంతో అత్యాచారం సమయంలో దుండగుల గాయపరిచి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: గుంపుగా వచ్చి కొట్టేశారు.. పంజాగుట్ట లలితా జ్యువెల్లరీలో ఆభరణాల చోరీ

ఆమెపై ఆ ప్రాంతంలోనే అత్యాచారం చేశారా? లేక వేరే ప్రాంతంలో అఘాయిత్యానికి పాల్పడి ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ల నివేదికను బట్టే కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స చేస్తున్నారు. ఆమె స్పృహలోకి వస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన ఒంగోలు నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read: బ్యూటీషియన్‌కు ‘సైబర్’ షాక్.. రూ.2లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.