యాప్నగరం

చిత్తూరు: కన్నతల్లి కర్కశం.. ప్రియుడి మోజులో బిడ్డలకు చిత్రహింసలు

భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ తన సుఖానికి అడ్డుగా ఉన్నరని ఐదుగురు కన్నబిడ్డలను దారుణంగా హింసిస్తోంది. ఈ ఘటన

Samayam Telugu 17 Aug 2020, 3:33 pm
కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే రాక్షసిగా మారింది. భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఆమె ఐదుగురు బిడ్డలను చిత్రహింసలు పెడుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో వెలుగుచూసింది. తంబుగానిపల్లె గ్రామానికి చెందిన ఓ మహిళకు ఓ వ్యక్తితో కొన్నాళ్లక్రితం వివాహమైంది. వీరికి ఐదుగురు సంతానం. అయితే భర్తను వదిలేసిన ఆమె మరో వ్యక్తితో కలిసి బెంగళూరులో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం కరోనా వైరస్ సోకడంతో తంబుగానిపల్లెకు వచ్చేసింది.
Samayam Telugu Image


Also Read: చెడు వ్యసనాలకు బానిసై భార్య, కూతురి హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం

ఈ క్రమంలోనే తన ఐదుగురు బిడ్డలను కొద్దిరోజులుగా కట్టేసి తీవ్రంగా హింసిస్తోంది. పిల్లలు ఇంట్లో నుంచి గట్టిగా కేకలు వేస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఆరా తీయగా ఆమె పైశాచికం వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం రాత్రి మరోసారి పిల్లలను వేధించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి గ్రామానికి చెందిన ఆరా తీశారు. పిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు వారిని హింసించిన తల్లిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి.. ఏడు నెలలకే యువతి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.