యాప్నగరం

ఒంగోలు క్వారంటైన్‌లో దారుణం.. భవనం పైనుంచి దూకేసిన మహిళ

కరోనా క్వారంటైన్ సెంటర్‌లో ఐసోలేషన్‌లో ఉంటున్న మహిళ అఘాయిత్యం చేసుకుంది. బిల్డింగ్ పైనుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 11 Sep 2020, 12:21 pm
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు క్వారంటైన్ సెంటర్‌ భవనం పైనుంచి దూకేసి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కరోనా సోకిన మహిళ, ఆమె భర్తను ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. క్వారంటైన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న మహిళ సడెన్‌గా ఆత్మహత్య చేసుకుంది. కళాశాల భవనం పై నుంచి అమాంతం దూకేసి బలవన్మరణానికి పాల్పడింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


ఆమె భర్త కూడా అదే క్వారంటైన్ సెంటర్‌లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. కరోనా భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: బిస్కెట్లు ఇస్తానని చెప్పి బాలికని తీసుకెళ్లి.. కర్నూలులో ఘోరం

మరోవైపు ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో చాలా మందిని హోమ్ క్వారంటైన్ లోనే ఉంచుతున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉండేందుకు అవకాశం లేని వ్యక్తులను ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు.

Read Also: ప్రియుడి మోసం తట్టుకోలేక పెళ్లైన మహిళ ఆత్మహత్య.. చిత్తూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.