యాప్నగరం

Hyd: పెళ్లైన ఆర్నెల్లకే నూరేళ్లు.. బిల్డింగ్ పైనుంచి దూకి..

భర్త ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్లాడు. అతని కుటుంబ సభ్యులతో కలసి భార్య హైదరాబాద్‌లో ఉంటోంది. భర్తతో గొడవపడి బిల్డింగ్ పై నుంచి కిందకు దూకేసింది.

Samayam Telugu 18 Oct 2020, 5:23 pm
పెళ్లైన ఆర్నెల్లకే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఐదో అంతస్తు నుంచి దూకి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో జరిగింది. కరీంనగర్‌‌కి చెందిన శ్రీవిద్య(27)కి వరంగల్‌కి చెందిన శబరీష్‌తో ఐదు నెలల కిందట వివాహం జరిగింది. ఇటీవల ఉద్యోగరీత్యా భర్త బెంగళూరు వెళ్లడంతో ఆమె చందానగర్‌లో ఉంటున్న వారింటికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో భర్తతో ఫోన్ మాట్లాడుతూ గొడవపడినట్టు తెలుస్తోంది.
Samayam Telugu శ్రీవిద్య(ఫైల్ ఫొటో)
suicide


క్షణికావేశంలో శ్రీవిద్య బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి అమాంతం దూకేసింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. కూతురి మరణవార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భర్త శబరీష్ వేధింపుల కారణంగానే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఆ ఒక్కమాటే శాపం.! చెల్లెలిపై అత్యాచారం, నలుగురిని నరికి దారుణ హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.