యాప్నగరం

మహిళ గొంతుకోసి దారుణ హత్య.. వికారాబాద్‌లో కలకలం

ఇండస్ట్రియల్ కారిడార్ పక్కనే ఉన్న నీటి గుంతలో మహిళ శవం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హతమార్చారు.

Samayam Telugu 29 Oct 2020, 9:43 am
వికారాబాద్‌లో మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న నీటి గుంతలో గుర్తు తెలియని వివాహిత మృతదేహం లభ్యమైంది. దుండగులు ఆమె గొంతుకోసి కిరాతకంగా చంపేసి రహదారి పక్కన పడేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని రాకంచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో ప్రధాన రహదారి కల్వర్టు పక్కన గుంతలో వివాహిత మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతుకోసి హత్య చేశారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
Samayam Telugu హత్యకు గురైన మహిళ
murder


Also Read: పెళ్లి సంబంధాలు రానీయడం లేదట.! పక్కింటోడిపై కోపంతో యువకుడు.. షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.