యాప్నగరం

విశాఖ: అనుమానంతో భార్య హత్య.. కాలుతో పీక తొక్కి కిరాతకంగా

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను అత్యంత కిరాతకంగా కడతేర్చాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు.

Samayam Telugu 12 Jul 2019, 5:12 pm
నుమానంతో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడో కసాయి భర్త. విశాఖపట్నంలోని మధురవాడలో గురువారం (జులై 11) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సింహాచలం (35) అనే వ్యక్తి విశాఖ నగరంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో పాటు రాత్రి వేళల్లో నూడుల్స్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య పద్మ (28)తో పాటు కుమారుడు ధర్మతేజ (9), కుమార్తె సంజన (5) ఉన్నారు. వీరంతా మధురవాడలోని 5వ వార్డు శివసక్తినగర్‌లో నివాసం ఉంటున్నారు.
Samayam Telugu Padma
భార్యను చంపిన భర్త


భార్య పద్మ ప్రవర్తనపై సింహాచలం కొద్ది రోజులుగా అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు అనుమానించాడు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆగ్రహంతో ఊగిపోయిన సింహాచలం తన భార్యను కిందపడేసి పీక మీద కాలు వేసి తొక్కి చంపేశాడు. ఊపిరాడకపోవడంతో పద్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. శుక్రవారం ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)కు తరలించారు.

నిందితుడు సింహాచలం.. పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో వివాహిత మర్డర్ మిస్టరీ తేలకముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.