యాప్నగరం

కనిపించకుండా పోయిన అక్క.. గుట్టల్లో శవమై.. షాద్‌నగర్‌లో దారుణం

రెండు రోజుల కిందట అక్క కనిపించకుండా పోయింది. అనుమానం వచ్చిన తమ్ముడు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె ప్రియుడి దారుణం వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 29 Sep 2020, 10:36 am
వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో ఉన్న ప్రియుడు వివాహితను బండరాయితో కొట్టి దారుణంగా చంపేశాడు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలు..కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన రాములు, చెన్నమ్మ దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు సంతానం. అదే మండలంలోని పోమాల్‌పల్లికి చెందిన జంగయ్యతో చెన్నమ్మకి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


షాద్‌నగర్‌లో జ్యూస్ బండి వ్యాపారం చేస్తున్న చెన్నమ్మ సడెన్‌గా కనిపించకుండా పోయింది. అనుమానం వచ్చిన ఆమె తమ్ముడు షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియుడు జంగయ్యని అదుపులోకి తీసుకుని విచారించడంతో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నెల 20న చెన్నమ్మ, ప్రియుడు జంగయ్యతో కలసి తలకొండపల్లి మండలంలోని చెన్నారం సమీపంలో ఉన్న మల్లప్పగుట్ట పైకి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు.

Also Read: Shocking Video: పెట్రోల్ బంకులో మంటలు.. ఎదురొడ్డి సిబ్బంది సాహసం

అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో జంగయ్య ఆగ్రహంతో రగిలిపోయాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న జంగయ్య దారుణానికి పాల్పడ్డాడు. బండరాయి తీసుకుని ప్రియురాలు చెన్నమ్మ తలపై కొట్టాడు. దెబ్బ బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జంగయ్య చెప్పిన వివరాల మేరకు మల్లప్పగుట్ట సమీపంలో చెన్నమ్మ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: 9వ తరగతి బాలికకు కడుపులో నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్తే షాకింగ్.. ఎనిమిదో నెల!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.