యాప్నగరం

ఇంట్లో అద్దెకు దిగి... మహిళను హత్య చేసిన భార్యాభర్తలు

ఇంట్లోకి ఈనెల 10వ తేదీన అనంతపురానికి చెందిన భార్యాభర్తలు అద్దెకు దిగారు. అయితే వారే రోహిణిని హత్య చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది..

Samayam Telugu 27 Jun 2020, 10:00 am
ఇంట్లో అద్దెకు దిగిన వారే... మహిళను దారుణంగా హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జరిగింది. క్వారీ కెనాల్‌ రోడ్డులో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ధవళేశ్వరం సీఐ అడబాల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం ధవళేశ్వరం క్వారీ కెనాల్‌ రోడ్డులో తూరుబెల్లి రోహిణి అనే 30 ఏళ్ల మహిళ తన తల్లి వెంకటలక్ష్మితో కలిసి నివాసం ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో నుంచి ఏడుపులు వినపడడంతో స్థానికులు వెళ్లిచూడగా రోహిణి మృతదేహం రక్తపుమడుగులో పడి ఉంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇంట్లోకి ఈనెల 10వ తేదీన అనంతపురానికి చెందిన భార్యాభర్తలు అద్దెకు దిగారు. వారే పదునైన ఆయుధంతో రోహిణి గొంతుకోసి హత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Samayam Telugu మహిళ దారుణ హత్య
woman killed by tenants


ఈ ఘటనలో మృతురాలి తల్లి చేతికి కూడా తీవ్ర గాయమైంది. దీంతో ఆమె అపస్మారక స్థితిలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతుంది. రాజమహేంద్రవరం అర్బన్‌ అడిషనల్‌ ఎస్పీ లతామాధురి, సౌత్‌జోన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని, మృతురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన అరగంటలోనే.. వారిని అరెస్ట్ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వైపు కారులో వెళ్లిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నల్లచొక్కా ధరించాడని, అతను భార్యతో కలిసి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వైపు కారులో వెళ్లారని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో గోదావరిలో స్నానం చేసి బయటకు వస్తుండగా నిందుతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోహిణిని ఎందుకు హత్య చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.