యాప్నగరం

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లేడీ టీచర్‌ దుర్మరణం

డీసీఎం వ్యాన్ బైక్‌ని ఢీకొట్టిన ఘటనలో ఓ స్కూల్ టీచర్ మృత్యువాతపడింది. ఉదయం పాఠశాలకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 4 Feb 2020, 4:16 pm
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. కృష్ణా జిల్లా నందిగామలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని నారాయణ స్కూల్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న మహిళా ఉపాధ్యాయురాలు మానస కిందపడి తీవ్రగాయాలయ్యాయి.
Samayam Telugu accident


Also Read: జగిత్యాలలో కాల్పుల కలకలం.. భార్యను తుపాకీతో కాల్చి..

తీవ్రగాయాలపాలైన మానసను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మానస కంచికచర్లలోని రవీంద్ర భారతి స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరిన మానస.. రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందడం విషాదం నింపింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.