కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. కృష్ణా జిల్లా నందిగామలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని నారాయణ స్కూల్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో బైక్పై ఉన్న మహిళా ఉపాధ్యాయురాలు మానస కిందపడి తీవ్రగాయాలయ్యాయి.
Also Read: జగిత్యాలలో కాల్పుల కలకలం.. భార్యను తుపాకీతో కాల్చి..
తీవ్రగాయాలపాలైన మానసను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మానస కంచికచర్లలోని రవీంద్ర భారతి స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరిన మానస.. రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందడం విషాదం నింపింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: జగిత్యాలలో కాల్పుల కలకలం.. భార్యను తుపాకీతో కాల్చి..
తీవ్రగాయాలపాలైన మానసను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మానస కంచికచర్లలోని రవీంద్ర భారతి స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరిన మానస.. రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందడం విషాదం నింపింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.