యాప్నగరం

తాగుబోతు భర్తను ఉరేసి చంపిన భార్య.. చేవెళ్లలో దారుణం

మద్యానికి బానిసై తమను వేధిస్తున్న వ్యక్తిని, భార్య, ఇద్దరు పిల్లలు కలిసి దారుణంగా చంపేసిన ఘటన చేవెళ్లలో జరిగింది. సాధారణ మరణంగా నమ్మించేందుకు వారు ప్రయత్నించినా చివరికి దొరికిపోయారు.

Samayam Telugu 25 Jul 2020, 8:21 am
మద్యానికి బానిసైన కుటుంబాన్ని వేధిస్తున్న వ్యక్తిని అతడి భార్య, పిల్లలే హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వెలుగుచూసింది. ఈ హత్యను సాధారణ మరణంగా చూపేందుకు వారు ప్రయత్నించగా మృతుడి సోదరుడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మల్కాపూర్‌కు చెందిన నార్ల వెంకటయ్య(40)కు భార్య కమలమ్మ, కుమార్తె(20), కొడుకు(15) ఉన్నారు. కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించే అతడు ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో భార్యను, పిల్లలను వేధించేవాడు.
Samayam Telugu Image


Also Read: కరోనా పాజిటివ్ బాలికపై అత్యాచారం.. ఢిల్లీ క్వారంటైన్ కేంద్రంలో ఘోరం

దీంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ పరువు తీస్తున్నాడని పిల్లలు కూడా అతడిపై కక్ష పెంచుకున్నారు. గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన వెంకటయ్యతో భార్య, పిల్లలు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే ముగ్గురు కలిసి అతడి మెడకు తాడు బిగించి హత్య చేశారు. నిద్రలో చనిపోయినట్లు శుక్రవారం ఉదయం బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే వెంకటయ్య మెడపై గాయాలు గమనించిన అతడి సోదరి చంద్రమ్మ అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది.

Also Read: కుటుంబానికి అండగా ఉంటానని నమ్మించి.. తల్లీకూతుళ్లపై లైంగిక దాడి

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకటయ్య మృతదేహాన్ని పరిశీలింగా మెడకు ఉరేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. కమలమ్మను విచారించగా పిల్లలతో కలిసి తానే ఉరేసి చంపినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: అఫైర్‌కు అడ్డొస్తోందని భార్య గొంతు నులిమి హత్య.. కృష్ణా జిల్లాలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.