యాప్నగరం

తాగుబోతు భర్తను గొంతు కోసి చంపేసిన భార్య.. వనపర్తిలో దారుణం

భార్యకు పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు అంటగట్టిన భర్త మద్యం తాగొచ్చి రోజూ వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన భార్య కత్తితో అతడి గొంతు కోసి చంపేసింది.

Samayam Telugu 11 Jun 2020, 8:39 am
మద్యానికి బానిపై నిత్యం అనుమానిస్తూ వేధిస్తున్న భర్తను గొంతు కోసి కిరాతకంగా చంపేసిందో ఇల్లాలు. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా మందడి మండలం స్కూల్ తండా గ్రామంలో వెలుగుచూసింది. పుల్యా తండాకు చెందిన బాల్య నాయక్‌కు మణెమ్మతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కూతురు ఉంది. బాల్య నాయక్ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేకపోవడంతో కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చేశాడు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న బాల్యనాయక్... రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటుండటంతో ఆమెను తరుచూ వేధిస్తున్నాడు. ఆమెకు పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు అంటగట్టి చిత్రహింసలు పెడుతున్నాడు.
Samayam Telugu Image


Also Read: ఆస్తి కోసం తల్లి, చెల్లి దారుణహత్య... తమిళనాడులో దారుణం

దీనికి తోడు ఇటీవల మద్యానికి బానిసైన అతడు రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడుతున్నాడు. మంగళవారం రాత్రి కూడా దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. భర్త వేధింపులతో విసిగిపోయిన మణెమ్మ కూతురి సాయంతో నిద్రమత్తులో ఉన్న భర్తను గొంతు కోసి చంపేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఐదేళ్లు సహజీవనం చేసి.. పెళ్లి చేసుకోమంటే పారిపోయాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.