యాప్నగరం

భర్తని చంపేసి భార్య హైడ్రామా.. సైలెంట్‌గా అంత్యక్రియలు.. తూర్పు గోదావరిలో దారుణం

అగ్రహారానికి చెందిన నరసింహమూర్తి ఆకస్మికంగా మరణించాడు. సాధారణ మరణమేనని భావించిన బంధువులు అంత్యక్రియలు జరిపించారు. ఆ తరువాత రెండురోజులకే షాకింగ్ విషయ బయటపడింది.

Samayam Telugu 1 Sep 2020, 5:27 pm
భర్త సడెన్‌గా మరణించడంతో భార్య భోరుమంది. వదిలివెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు సాధారణ మరణంగానే భావించారు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించేశారు. ఆ తర్వాత రెండు రోజులకి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కసాయి భార్య బాగోతం బయటపడింది. ఆయన చనిపోలేదు.. భార్యే కిరాతకంగా చంపేసిందని తెలిసి అంతా షాక్‌కి గురయ్యారు. ఈ అత్యంత దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


జిల్లాలోని కాట్రేనికోన మండలం చేయ్యేరు అగ్రహారానికి చెందిన ఉచ్చుల నరసింహమూర్తి (45)ని కట్టుకున్న భార్యే దారుణంగా హత్య చేసింది. కిరాతకంగా చంపేసి హైడ్రామాకు తెరతీసింది. తన భర్త చనిపోయాడంటూ విలపిస్తూ సాధారణ మరణంగా నమ్మించింది. నమ్మేసిన కుటుంబ సభ్యులు, బంధువులు రెండు రోజుల కిందట అంత్యక్రియలు జరిపించారు. అయితే ఉన్నట్టుండి నరసింహమూర్తి చనిపోవడంపై గ్రామస్తులకు అనుమానాలు రేగాయి.

Also Read: దాగుడుమూతల పేరుతో దారుణం.. బాలికపై ఏడుగురి అత్యాచారం

భార్యపై అనుమానంతో గట్టిగా నిలదీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. భర్తను తాను హత్య చేసినట్లు ఒప్పేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమలాపురం డీఎస్పీ మాసుం బాషా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: తప్పతాగి పోలీసుల అరాచకం.. లేడీ ఆఫీసర్‌ని వేధించి.. ఆమె బావ దారుణ హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.