యాప్నగరం

భర్తని కత్తిపీటతో నరికి చంపిన భార్య.. గుంటూరులో దారుణం

మద్యానికి బానిసైన రుద్ర రెడ్డి భార్య ఉమని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. మూడు రోజులుగా ఫుల్లుగా మద్యం తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవపడుతున్నాడు.

Samayam Telugu 2 Jun 2020, 9:09 pm
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్న భర్తని భార్య కిరాతకంగా హత్య చేసింది. కత్తిపీటతో నరికి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన అడపా రుద్ర రెడ్డి, ఉమ దంపతులు. మద్యానికి బానిసైన రుద్ర రెడ్డి ప్రతిరోజూ మద్యం తాగొచ్చి భార్యని వేధింపులకు గురిచేసేవాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kathipeeta


గత మూడు రోజుల నుంచి భర్త వేధింపులు ఎక్కువవడంతో భరించలేకపోయిన భార్య కత్తిపీటతో దాడి చేసింది. మద్యం మత్తులో ఉన్న భర్త రుద్ర రెడ్డిని విచక్షణా రహితంగా నరికేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కోవిడ్ ఆస్పత్రిలో కామపిశాచి.. లేడీ డాక్టర్ నోరుమూసి.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.