యాప్నగరం

యాక్సిడెంట్‌లో అన్న మరణం.! మరిది అనుమానంతో వదిన బాగోతం వెలుగులోకి..

అహదుల్లా అకస్మాత్తుగా ప్రమాదంలో మరణించాడని అతని భార్య కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే మృతుడి తమ్ముడుకి అనుమానం మొదలవడంతో వదిన బాగోతం బయటపడింది.

Samayam Telugu 31 Jul 2020, 9:56 pm
వివాహేతర సంబంధం మోజులో ప్రియుడితో కలసి భర్తను చంపేసిందో కసాయి భార్య. తన భర్త యాక్సిడెంట్‌లో చనిపోయాడంటూ హైడ్రామాకు తెరతీసింది. అనుమానం వచ్చిన మరిది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వదిన బాగోతం బట్టబయలైంది. ముంబైలోని శివాజీ నగర్ ఏరియాకి చెందిన అహదుల్లా, యాస్మిన్(35) భార్యాభర్తలు. సడెన్‌గా అహదుల్లా మృతి చెందాడు. ప్రమాదంలో తన భర్త చనిపోయాడని భార్య నమ్మబలికింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
illegal affair


అయితే ఆమె మరిది తన అన్న మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించాడు. నౌషద్ ఖాన్ అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. నౌషద్ ఖాన్‌ని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేశాడు. మృతుడి భార్య యాస్మిన్‌తో తనకు శారీరక సంబంధం ఉందని.. అందుకు అతను అడ్డుగా ఉన్నాడని అంతమొందించినట్లు చెప్పాడు.

Also Read: పొలం వివాదంలో ఘర్షణ.. కర్రలు, కొడవళ్లతో దాడి.. కర్నూలులో కలకలం

అంతేకాకుండా అహదుల్లా తనకి రెండు లక్షల రూపాయలు అప్పు ఉన్నాడని.. బాకీ కూడా తీర్చకపోవడంతో అతన్ని చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించినట్లు చెప్పాడు. అందుకు తన ప్రియురాలు యాస్మిన్ కూడా సహకరించిందని చెప్పడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సహకరించిన ఖాన్ అనుచరులను కూడా అరెస్టు చేసి జైలుకి పంపించారు.

Read Also: ప్రైవేట్ పార్ట్స్‌లో చీపురు పెట్టి.. సవతి తండ్రి శాడిజం, ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.