యాప్నగరం

భర్తని రెచ్చగొడుతున్న బావ.. చంపేసిన మరదలు.. దారుణం

మానసికంగా కుదురుగా ఉండని భర్తని రెచ్చగొట్టి తనను కొట్టిస్తున్నాడని మరదలు కక్ష పెంచుకుంది. ప్రియుడితో కలసి బావని అంతమొందించింది. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లో జరిగింది.

Samayam Telugu 10 Dec 2020, 5:45 pm
జళ్వార్ జిల్లా చాందానియాఖేది గ్రామానికి చెందిన సియారం మీనా దారుణ హత్యకు గురయ్యాడు. అనూహ్యంగా వ్యవసాయ బావిలో శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సొంత తమ్ముడి భార్యే మరో ఇద్దరి సాయంతో అంతమొందించినట్లు తేలింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


మానసికంగా స్థిరంగా ఉండని భర్తకి తరచూ ఏవేవో చెప్పి రెచ్చగొడుతున్నాడని.. తనను కొట్టేందుకు ప్రేరేపిస్తున్నాడని మీనాపై మరదలు గుడ్డి బాయ్ కోపం పెంచుకుంది. అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకుని తన ప్రియుడు సోను మాలి, తన వద్ద పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కి చెందిన శ్యామ్ భీల్‌తో కలిసి పథకం రచించింది. రాత్రి వేళ లైట్ ఇస్తానని చెప్పి బొరెఖేది సమీపంలోని పొలంలోకి మీనాని రప్పించింది.

అక్కడికి వచ్చిన మీనాపై సోను, శ్యామ్ దాడి చేసి చంపేశారు. అనంతరం అతని శవాన్ని అక్కడే బావిలో పడేసి వెళ్లిపోయారు. నిందితులు గుడ్డిబాయ్, శ్యామ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేశారు. ఆమె ప్రియుడు సోను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: కొడుకు ప్రియురాలిని చంపేందుకు వచ్చిన జంట.. పట్టించిన బురఖా.. షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.