యాప్నగరం

ఆఫీసులోనే మహిళపై అత్యాచారయత్నం, హత్య.. హైదరాబాద్‌లో ఘోరం

తన సహోద్యోగిపై ఆఫీసులోనే అత్యాచారానికి యత్నించిన వెంకటేశ్వరరావు ఆమె ప్రతిఘటించడంతో గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ప్రాంతంలో జరిగింది.

Samayam Telugu 19 Jul 2020, 9:51 am
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జనప్రియ కాలనీలోని ఫ్యామిలీ కేర్ సర్వీస్ సెంటర్‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హేమలత అనే మహిళ ఫ్యామిలీ కేర్ సర్వీస్‌ సెంటర్‌లో పనిచేస్తోంది. సహ ఉద్యోగి వెంకటేశ్వరరావు ఆమెను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. శుక్రవారం పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో హేమలత అర్ధరాత్రి వరకు ఆఫీసులో ఉండిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న వెంకటేశ్వరరావు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.
Samayam Telugu Image


Also Read: భార్య చేయి పట్టుకున్నాడని హత్య.. విజయనగరంలో దారుణం

అప్రమత్తమైన హేమలత అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆవేశానికి గురైన అతడు కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు హేమలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శనివారం నిందితుడు వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు.

Also Read: సెల్‌ఫోన్ వాడొద్దన్న తల్లిదండ్రులు.. ఉరేసుకుని యువతి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.