యాప్నగరం

పచ్చని కాపురంలో అనుమాన భూతం.. భార్య దారుణహత్య

పిల్లలు పుట్టిన తరువాత కూడా వీరి కాపురం కొంతకాలం సజావుగానే సాగింది. భార్యపై అనుమానం పెంచుకున్న వీరబాబు తరుచూ వేధిస్తుండటంతో మంజు కుటుంబసభ్యులు సంవత్సరం కిందట కొత్తపేట పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 30 May 2019, 8:50 am
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యికి చెందిన లంజిపల్లి వీరబాబు ఆటోడ్రైవర్‌ పనిచేస్తున్నాడు. అతడికి కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన ఎరకా వెంకట్రావు కుమార్తె మంజుతో 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మున్నా(11), లక్ష్మీదుర్గ(7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Samayam Telugu murderr


పిల్లలు పుట్టిన తరువాత కూడా వీరి కాపురం కొంతకాలం సజావుగానే సాగింది. భార్యపై అనుమానం పెంచుకున్న వీరబాబు తరుచూ వేధిస్తుండటంతో మంజు కుటుంబసభ్యులు సంవత్సరం కిందట కొత్తపేట పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అత్తమామలపై అనుమానం పెంచుకున్న వీరబాబు భార్యను పుట్టింటికి వెళ్లకుండా చేశాడు. దీంతో భార్యభర్తల మధ్య రోజూ గొడవలు జరుగుతున్నాయి.

మంగళవారం రాత్రి 10గంటల సమయంలో పిల్లలు ఇంట్లో లేని సమయంలో భార్యతో గొడవపడిన వీరబాబు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం వీరబాబు బొమ్మూరు పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. నిందితుడపై కేసు నమోదు చేసిన పోలీసులు మంజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.