యాప్నగరం

యూపీలో మరో నిర్భయ ఘటన.. బస్సులోనే యువతిని రేప్ చేసి.. దారుణం

బహ్రెయిచ్ జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్ క్లీనర్‌ రవి నీచానికి పాల్పడ్డాడు. ఒంటరిగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళను అమానుషంగా అత్యాచారం చేశాడు.

Samayam Telugu 30 Aug 2020, 7:28 pm
బస్సులో మహిళను గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన నిర్భయ ఘటనతో దేశం రగిలిపోయింది. మరోమారు అలాంటి దారుణాలు జరగకుండా ఉండేందుకు కఠినమైన నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అయినా అలాంటి దారుణాలకు అడ్డుకట్టపడడం లేదు. నిర్భయ దోషులకు ఉరిశిక్షలు విధించినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. కదులుతున్న బస్సులో యువతిని అమానుషంగా రేప్ చేసిన ఘటన తాజాగా యూపీలో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rape in bus


ఢిల్లీకి చెందిన మహిళ యూపీ రాజధాని లక్నో నుంచి ప్రైవేటు బస్సులో బయల్దేరింది. ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసిన బస్ క్లీనర్ రవి కీచకుడిగా మారాడు. యమున ఎక్స్‌ప్రెస్‌వేపై కదులుతున్న బస్సులోనే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బస్సులోనే దారుణంగా రేప్ చేశాడు. బాధితురాలు వెంటనే 112 హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Also Read: కడపలో దారుణం.. మైనర్ బాలికపై వీఆర్‌ఏ అత్యాచారం

బస్సు మధుర జిల్లాలోని మాంట్ టోల్‌గేట్‌కి చేరుకోగానే నిలిపివేశారు. నిందితుడైన బస్సు క్లీనర్‌ రవిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆమెకు రక్షణ కల్పించి ఢిల్లీ రోహిణీలోని ఆమె ఇంటికి క్షేమంగా చేర్చారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు.

Read Also: నేవీ ఉద్యోగి భార్య ఆత్మహత్య.. వేధింపులు భరించలేక.! గుంటూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.