యాప్నగరం

అర్ధనగ్నంగా మహిళ శవం.. అత్యాచారం చేసి.. నిజామాబాద్‌లో ఘోరం

అటవీ ప్రాంతంలోని నీటిమడుగులో అర్ధనగ్నంగా మహిళ శవం తీవ్ర కలకలం రేపింది. దుండగులు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 31 Dec 2020, 4:40 pm
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ దిశ ఘటన, ఆసిఫాబాద్ సమత హత్య కేసు మరువక ముందే తెలంగాణలో మరో ఘోరం వెలుగుచూసింది. మహిళను అత్యాచారం చేసి కిరాతకంగా చంపేసిన అమానుష ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వర్ని మండలం బడా పహాడ్ అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలోని నీటిమడుగులో అర్థనగ్నంగా పడి ఉన్న మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. మహిళను గుర్తుతెలియని దుండగులు అమానుషంగా అత్యాచారం చేసి అంతమొందించారు. ఆమె ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు ముఖాన్ని కాల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu హత్యకు గురైన మహిళ
rape and murder


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.