యాప్నగరం

మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. మృగాళ్ల పైశాచికత్వం

మృగాళ్ల పైశాచికత్వానికి మరో మహిళ బలైంది. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తాజాగా వెలుగుచూసింది.

Samayam Telugu 15 Feb 2020, 10:32 pm
కాలేజీకి వెళ్తున్న లేడీ లెక్చరర్‌పై ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన మరువకముందే మహారాష్ట్రలో మరో ఘటన చోటుచేసుకుంది. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటన నాసిక్ జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu fire+2


ఒంటరిగా ఉంటున్న వితంతు మహిళ(35)పై ముగ్గురు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు తాళలేక ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలను ఆర్పివేసి ఆమెను ఆస్పత్రికి తరలించారు. సుమారు 50 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతోంది. ఎవరు నిప్పు పెట్టి ఉంటారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: ఆ శృంగారం కావాలంటే.. ట్రాన్స్‌జెండర్లు, గేలతో సెక్స్ ట్రాప్.. బాధితులంతా బడాబాబులే..

వితంతు మహిళపై పెట్రోల్ పోసి అంటిచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.